తెలంగాణలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు విడుదల చేయడం జరిగింది. మే నెల 17 నుండి 26వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి 9 మరియు పదో తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే జూన్ 13 వరకు వేసవి సెలవులు. పదవ తరగతి వారికి పరీక్షల్లో 6 సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.ఇంతకు ముందు 11 పేపర్లు ఉండేవి. ఈసారి కేవలం 6 సబ్జెక్టులకు ఆరు పేపర్ల మాత్రం నిర్వహించడం జరుగుతుంది.
0 Comments